ఆది శంకరాచార్య జయంతి

on 0 comments Read Full Article




శ్రీ ఆది శంకరాచార్యుల వారు భారతావని లో జన్మించి మానవాళికి మహోపకారం చేసారు.అతి క్లిష్టమైన వేదాంత విషయాల్ని ఒకపక్క వివరించి, మరొకపక్క పరమ పవిత్రమైన నాలుగు పీఠాలను భారత దేశపు నాలుగు దిక్కులా స్థాపించి , మరొకపక్క ఆధ్యాత్మిక లోకపు సరిహద్దులలోకి పయనించేందుకు మెట్లుగా,దీపకళిక ల్లాగా, సులువైన తోవల్లాగా ఎన్నో స్తోత్రాలు,స్తుతులు,అష్టకాలు,రచించారు.అన్నీ మానవుల ఎదుటపెట్టి చదువుకొని తరించండి అని
దీవించారు. అతి పిన్న వయస్సులో ఆయన చేసిన రచనలు పండితులని కూడా అబ్బుర పరిచాయి. అర్ధం అయినా కాకపోయినా వేదము విన్నపుడు ఒకరక మైన శాంతి ,ఒకరక మైన తృప్తి,ఒకరకమైన పవిత్రతా భావం మనిషికి కలుగుతుంది.అలాగే శ్రీ శంకరాచార్యులవారి కవితలు చదువుతూంటే అమోఘ మైన భక్తి భావం పొంగుతుంది. విశేష మేమిటంటే ఆయన రచనలోని ఎ పదమైనా ఎక్కువ అనిపించదు,ఒక్కపదం తీసిదాని స్థానంలో మరోపదం ఎవ్వరూ పెట్టలేరు. గొప్ప కళాకారుని వలె మాటలు వజ్రాలు ,కెంపులు ,ముత్యాలు ,పచ్చలు పొదిగినట్లు పొదిగారు.
వారిని తలుచుకొని ఒక్క అష్టకం చాడువుకొందాము.

శ్రీమదచ్యుతాష్టకం

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్ ,రామకృష్ణ పురుషోత్తమ విష్ణో ,వాసుదేవ భాగవన్ననిరుద్ద శ్రీపతే!శమయ దుఃఖ మశేషం
విశ్వ మంగళ విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర ,ముక్తిదాయక ముకుంద మురారే!శ్రీ పతే!శమయ దుఃఖ మశేషం
రామ చంద్ర రఘునాయక దేవ దీన నాథ దురితక్షయ కారిన్
యాదవేంద్ర యదుభూషణ యజ్న శ్రీపతే!శమయ
దేవకీ తనయ దు:ఖ దవాగ్నే రాదికారమణ రమ్య సుమూర్తే!
ద:ఖ మోచన దయా ర్నవ నాథ శ్రీపతే శమయ
గోపికావదన చంద్ర చకోరా నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో
పూర్ణ రూప జయశంకర శర్వ శ్రీపతే శమయ
గోకులేశ గిరి ధారణా ధీర యామునాచ్చాతట ఖేలన వీర
నారదాది ముని వందిత పాద శ్రీపతే!శమయ దు:ఖ మశేషం
ద్వారకాధిప దురంతా గుణాబ్దే ప్రాణనాథ పరిపూర్ణ భవారే!
జ్ఞాన గమ్య గుణసాగర భ్రహ్మన్ శ్రీమతే శమయ దు:ఖ మశేషం
దుష్ట నిర్దళన దేవ దయాళో!పద్మ నాభ ధరణీ ధర ధన్విన్
రావనాన్టక రమేశమురారే!శ్రీపతే!శమయ దు:ఖ మశేషం

అచ్యుతాష్టక మిదం రమణీయం నిర్మితం భవ భయం విని హన్తుం ,య:పఠే ద్విషయ వ్రుత్తి నివృత్తిం జన్మ దు:ఖ మఖిలం స జహాతి.


ఇతి శ్రీ శంకరాచార్య విరచిత మచ్యుతాష్టక స్తోత్రం .

************************************