అడివి ఆంజనేయ స్వామి నూజివీడు

on

అడివి     ఆంజనేయ స్వామీ        నూజివీడు
                మాతాతగారి వూరు నూజివీడు . సాకు    దొరికి నప్పుడల్లా     వెళ్ళిపోయేవాళ్ళం ఇంటి చుట్టూ పళ్ళ చెట్లు ,పూల మొక్కలు వుండేవి. ఒపదిమంది  పిల్లలు వుండే వారు . కనకాంబరాలు,గన్నేరు పూలు,  రాధా మనోహరాలు,  జాజి పూలు , మందారాలు చెట్టు కనిపించకుండా  పూసెవి . పిల్లలు తలోపూల మొక్కా దత్తత  తీసుకొని జాగ్రత్తగా   నీళ్ళుపోసి,ఎరువులు వేసి  పెంచెవారు.
                                          మాతాత గారు కొనేటిపేట లో వుండేవారు.  పెద్దకోనేరు,మెట్లు వుండెవి. ఆగట్టు వెంటే  నదిచెవాళ్ళమ్.   అడివి   ఆంజనేయ స్వామీ   గుడి వూరికి దూరంగా  వుంటుంది .ఇప్పుదు వూరుపెరిగిపోయి  అన్తాకలిసిపొయిన్ది. కోనేటిపేట నుంచి దూరమే గుడికి వెళ్ళాలంటే    అదొక    పెద్ద ప్రయాణం . ఆవూళ్ళో ఔటింగ్లు రెండే   ,ఒకటి ఆంజనేయ స్వామీ    గుడి,రెండోది     సినిమా . ఎక్కడికన్నా వెళ్ళాలంటే   మధ్యాన్నం నుంచి ప్రయాణ సన్నాహాలు జరిగెవి.  పెరట్లోని కనకాంబరాలు కోసి   ఆంజనేయ స్వామికి    దండ  కట్టి పట్టు కెళ్ళాలి అప్పుడు అందరిచేట్ల పూలు ఇచ్చెసెవాళ్ళు  . కనకామ్బరాలుకాదాలు సన్నగా  వుంటాయి నెమ్మదిగా  దారం ముడివేసి లాగాలి లేకపోతె కత్తిరించుకు పొతాయి.   రెండుపూలు బొత్తిగా పెడితే ఒకళ్ళు మాల  ఒత్తుగా  కట్టే వారు.  నాయకత్వం,శిష్యరికం, పోట్లాటలు జరిగెవి.ఒక కొబ్బరికాయకొని పిల్లలందరం    నడిచి వెళ్ళెవాళ్ళమ్.   పరీక్ష పాస్ చేయించమని,  పండక్కి పట్టు పరికిణా    కుట్టించమని,   జడ పొడుగ్గా  ఎదగాలని  ,ఎవోకొరికలు  ఆంజనేయ స్వామికి      నివేదించే వాళ్ళం . చల్లగాగుడి ఆవరణలో కూర్చుని కొబ్బరిముక్కలు ప్రాసాదం   తిని నడిచి ఇంటికి చెరెవాళ్ళమ్.   ఆంజనేయ స్వామీ ఒక చెట్టుకింద వుండేవారు,పక్కనే వేణు  గోపాల   స్వామీ నిలబడి వుంటాడు.  ఆంజనేయ స్వామికి పైన కప్పు,ఆచ్చాదన  ఇష్టం లేదని ఏమీ   చెయ్యలెదు. ఆభరణాలు వుండేవి కావు. ఈమధ్య    పైన ఆచ్చాదనగా  కప్పువేసారు చుట్టూ గోడ  కట్టారు .మాకు ఏమిటోగా    అనిపించిన్ది.  కానీ ఇప్పటికి ఒక్కరొజుకోసమ్   వెళ్ళినా సరే   అడివి ఆంజనేయ స్వామీ దర్సనం   చేసుకోకుండా   రాము.  ఇంతవరకు అలా  జరగా లేదు.   మా  తాత గారు చనిపోయాక మా  పిన్ని గారు   యిల్లు కొనుక్కొన్నారు అందుచేత ఇప్పటికి తరుచుగా    వెడుతూనే ఉంటా మొ న్న జులై లో వెళ్లి నపుడు   ఫోటో తీసాను.  

0 comments:

Post a Comment